ధర్మవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టేషన్ ఇన్స్పెక్టర్ గురు ప్రసాద్
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి ఒక్కరూ బాదకద్రవ్యాలకు పూర్తిగా దూరం ఉండాలని ధర్మవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ఇన్స్పెక్టర్ గురు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించి మాదక ద్రవ్యాల వాటి వలన కలుగు దుష్పరిమానులపై అవగాహన సదస్సును కూడా నిర్వహించారు. అనంతరం గురు ప్రసాద్ మాట్లాడుతూ నేటి యువతీ యువకులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలిపారు. ప్రజలకు యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను వివరించం కూడా జరిగిందని తెలిపారు. మత్తు పదార్థాల విక్రయము రవాణా వినియోగించే వారి సమాచారాన్ని డైల్ 100 లేదా టాస్క్ ఫోర్స్ సిఐ కు సమాచారాన్ని అందించాలన్నారు. అంతేకాకుండా గంజాయి తదితర వాటి రవాణా కేసుల్లో యువతి యువకులు ఒక్కసారి చిక్కుకుంటే అరెస్టుతో పాటు వారి భవిష్యత్తు కూడా అంధకారం అవుతుందని తెలిపారు. నిందితులపై నేరము రుజువైనట్లయితే 10 సంవత్సరాలకు పైబడి జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. చెడు సహవాసాలతో వ్యసనాలకు యువత బానిసై లక్ష్యం కు దూరం కావద్దని తెలిపారు.మత్తు పదార్థాలకు అలవాటు పడే యువత శారీరక రుగ్మతలకు లోనై, జ్ఞాపకశక్తి కోల్పోయి, విచక్షణ ,విజ్ఞత కోల్పోయి నేరాలకు పాల్పడుతూ దురదృష్టవశాత్తు కేసుల్లో నిందితులుగా మారుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతుందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ బాబు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రశాంతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కుళాయి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.