విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం ఆర్డిటి క్రికెట్ కోచింగ్ సెంటర్ లో ప్రాక్టీస్ చేస్తున్న బాలికలు ఎస్. నాగజ్యోతి, పి. తేజు దీపిక అండర్-19 లో అనంతపురం జిల్లా నుండి సౌత్ జోనికి ఎంపిక కావడం జరిగిందని క్రికెట్ కోచ్ రాజశేఖర్, పృద్వి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ టీం ఈనెల 28వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు అనంతపురంలో జరిగే అండర్-19 సౌత్ జోన్ టోర్నమెంటులో పాల్గొంటుందని తెలిపారు. అందరికీ స్పోర్ట్స్ అందించాలన్న ఉద్దేశంతో ఆర్డిటి స్పోర్ట్స్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 నుండి 7 1/2 గంటల వరకు తదుపరి సాయంత్రం నాలుగున్నర గంటల నుండి 6:30 వరకు ఆర్డిటి స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఉత్తమంగా శిక్షణతో పాటు క్రీడాకారుల బలం కోసం పోషక ఆహారం కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆసక్తి గలవారు సెల్ నెంబర్ 9985929285 కు సంప్రదించాలని తెలిపారు.