టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని సమస్యలను పరిష్కరించడంలో అధికారుల కృషి ఎంతో అవసరమని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ అధికారులతో పరిటాల శ్రీరామ్ బిజెపి జిల్లా అధ్యక్షుడు సంధి రెడ్డి శ్రీనివాసులు పట్టణ అభివృద్ధి విషయంపై వారు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో 40 వార్డుల్లో సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. అందుకే పట్టణంలో పలు వార్డులలో పర్యటించడం జరిగిందని పలు సమస్యలు మా దృష్టికి రావడం జరిగిందని తెలిపా రు. వార్డులో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయన్న సమాచారాన్ని అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో చెత్త ఎక్కడపడితే అక్కడ వేయడం, డస్ట్ బిన్లు నిండిన వాటిని చెత్త తీసుకోలేకపోవడం, డ్రైనేజీ సమస్యలతో పాటు తక్షణమే పరిష్కరించాల్సిన వాటిమీద చర్చించడం జరిగిందని తెలిపారు. ఇందుకు స్పందన సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. గురువారం నుంచి చర్యలు అధికారులతో పాటు చేపడతామని మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ హామీ ఇచ్చారు. ధర్మవరం పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడం జరుగుతుందని మరోసారి పరిటాల శ్రీరామ్ తెలిపారు. పట్టణ ప్రజలు కూడా సహకరించాల్సిన బాధ్యత కూడా ఉందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.