డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ టి సేల్వియా సా ల్మాన్
విశాలాంధ్ర -ధర్మవరం : లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం అవుతుందని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ టి సేల్వియా సాల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పిసి అండ్ పి ఎన్ డి వై యాక్ట్ పై సబ్ డిస్టిక్ లెవెల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 11 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని అందులో రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో 9 ప్రైవేట్ సెంటర్లలో ఉన్నాయని తెలిపారు. ఈ స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం ఆడపిల్లలు అయితే అని తెలిస్తే అబార్షన్ చేయడం లాంటివి చట్ట వ్యతిరేకమని తెలిపారు. అటువంటి వాటిని చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం పుట్టపర్తి నుంచి బాబా ఫక్రుద్దీన్ జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ పర్యవేక్షణలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఏరియా హాస్పిటల్ వైద్యులు, టూ టౌన్ సిఐ అశోక్ కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ, వైద్యాధికారులు వెంకటేశ్వర్లు, సురేష్ నాయక్, శ్రావణి, రోటరీ క్లబ్ అధ్యక్షులు జయ సింహా, అన్నమయ్య సేవా సమితి పొరాళ్ళ పుల్లయ్య, అయ్యప్ప సేవా కమిటీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.