విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని అర్హులైన 6,922 మంది పెన్షన్ దారులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుండి పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు ఇంచార్జ్ ఎంపీడీవో అబ్దుల్ నబీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన 6,922 మంది పెన్షన్ దారులకు రూ.4 కోట్ల 72 లక్షల 88 వేల 500 పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగులచే జులై 1వ తేదీన పూర్తి దశలో పంపిణీ చేయుటకు అన్ని చర్యలు గైకొనడం జరిగిందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మేరకు ఏప్రిల్, మే, జూన్ పెంచిన వెయ్యి రూపాయలతో పాటు అనగా 3 వేల రూపాయలు తో పాటు జూలై నెల 4వేల రూపాయలతో కలిపి 7000 రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. పెన్షన్ దారులు అందరూ కూడా తమ యొక్క పెన్షన్ను ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని, ఏ ఒక్కరు కూడా సచివాలయాల దగ్గర రాకూడదని వారు స్పష్టం చేశారు. కావున పెన్షన్దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.