రాజీమార్గములో ఇరువురికి న్యాయం జరుగుతుంది…
మండల న్యాయ విజ్ఞాన సదస్సు చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి.
విశాలాంధ్ర – ధర్మవరం: జాతీయ మెగా లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పే తుది తీర్పు అవుతుందని, రాజీమార్గమే రాజ మార్గమని, ఇరువురికి సమ న్యాయం జరుగుతుందని మండల న్యాయ విజ్ఞాన సదస్సు చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి, జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య సాయి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అవధాని మురళీ తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి మాట్లాడుతూ ఈ జాతీయ మెగా లోక్ అదాలతో కార్యక్రమాన్ని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోను, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోను, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం ఈ లోక అదాలతో 109 కేసులు పరిష్కారం కావడం జరిగిందని తెలిపారు. ఇందులో బ్యాంకు రుణాలు 3(12 లక్షల 81 వేలు), బిఎస్ఎన్ఎల్ కేసులు 3 (రూ.4,053), సివిల్ కేసులు 3(రూ. 8 లక్షలు), గొడవ కేసులు 54, ఇసుక రవాణా కేసులు7(రూ.15,000), భరణం కేసులు 3 (రూ.16 లక్షలు), చెక్ బౌన్స్ కేసులు 01,(రూ.2,50,000), పెట్టి కేసులు 35 (రూ.2,23,020) వెరసి109 కేసులు పరిష్కారం కావడం జరిగిందని వారు తెలిపారు. ఈ లోక్ అదాలత్ విజయవంతం చేసిన కక్షిదారులకు, బార్ అసోసియేషన్ కు, సీనియర్, జూనియర్ న్యాయవాదులకు, లోక్ అదాలత్ సభ్యులకు, కోర్టు పరిధిలోని పోలీస్ శాఖకు వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, లోక్ అదాలత్ సభ్యులు వీరాంజనేయులు, మహబూబ్ జాన్, భాస్కర, గోపికృష్ణ, బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.