తిరుపతి: భారతదేశపు ప్రముఖ నిర్మాణ సామగ్రి కంపెనీ అయిన ఇన్ఫ్రా.మార్కెట్, తన డైరెక్ట్-టు-కన్సూమర్ (డి2సి) బ్రాండ్ ఎవాస్ ద్వారా ’ఘర్ధడక్నెదో’ కాంపెయిన్ను ప్రారంభించినట్టు ప్రకటించింది. గృహిణులు, వారి గృహాల మధ్య వేళ్ళూనుకున్న బలమైన సంబంధం సారాన్ని గుర్తిస్తూ, మన లాగే మన ఇళ్ళు కూడా శ్వాసిస్తాయి, జీవిస్తాయన్న వాస్తవాన్ని ఈ కాంపెయిన్ వేడుక చేస్తోంది. మనకెంతో ఇష్టమైన కుటుంబసభ్యుల పట్ల మనం చూపించే అదే సంరక్షణ, దీక్షలతోనే ఇంటిని కూడా చూసుకోవడమనే ఆలోచన లక్ష్యంగానే ఇది సాగుతుంది. గృహిణులు ఇంటిలో మూలమూలల నుంచి సాహచర్యం, సౌఖ్యం పొందుతూ వారి జీవితకాలంలో గణనీయకాలం ఇంటిలోనే గడుపుతారన్న విషయాన్ని ఎవాస్ గుర్తిస్తోంది. గుండెల నిండా ఆప్యాయతతో, వారు వారి ఇళ్ళని తమ పిల్లల్లా, కుటుంబ సభ్యునిలా లేదా స్నేహితునిలా చూసుకుంటారు. ప్రత్యేక సందర్భాలకి వాళ్ళని తయారు చేసినట్టే, భావావేశపరంగా ఇళ్ళతో ఎన్నో బంధాలు ఏర్పరుచుకుంటామన్న విషయాన్ని గుర్తిస్తూ, మన ఇళ్ళని మెరుగుపరుచుకోడాన్ని, ప్రత్యేక శ్రద్ధ వహించడాన్ని ఎవాస్ ప్రోత్సహిస్తుంది. గృహిణులకి సాధికారత కల్పిస్తూ, పూర్తి శ్రేణి గృహపునరుద్ధరణ ఉత్పత్తుల్ని ఎవాస్ అందిస్తోంది.