శ్రీ లలిత నాట్య కళానికేతన్ బృందం
విశాలాంధ్ర -ధర్మవరం:: శనివారం జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇండియన్ టీం గెలుపు పట్ల శ్రీ లలిత నాట్య కళానికేతన్ శిష్య బృందం సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గురువులు బాబు బాలాజీ కమలా బాలాజీ రామ లాలిత్యాలు మాట్లాడుతూ పిల్లలకు కేవలం నాట్యం మాత్రమే కాకుండా దేశభక్తిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించమని, ఆ ఇండియా టీం వాళ్లందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు. ఇండియా ఈ ఘన విజయం సాధించినందుకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని తెలిపారు. ఈ సంబరాలలో పిల్లలు దేశభక్తి పాటలకు నాట్యం చేసి వారి దేశభక్తిని చాటుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లలిత నాట్య కళానికేతన్ శిష్య బృందం పాల్గొన్నారు.