విశాలాంధ్ర -ధర్మవరం : కార్పెంటర్స్ సమస్యలు పరిష్కరించేంత వరకు మా పోరాటాలను చేస్తూనే ఉంటామని కార్పొరేషన్ అసోసియేషన్ అధ్యక్షులు శివ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో భారీ బైక్ రైలును నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. ఈ బైకు ర్యాలీకి ఉమ్మడి జిల్లాలోని కార్పెంటర్స్ అందరూ కూడా పూర్తి మద్దతును ప్రకటించారు. ఎర్రగుంట సర్కిల్ నుంచి పట్టణంలోని ప్రధాన వీధులు మీదుగా బైక్ ర్యాలీ ప్రదర్శన ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం నాయకులు మాట్లాడుతూ యూపీ వర్కర్స్ ను తీసుకొచ్చి మా ఉపాధికి గండి కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పెంటర్స్ కు పనిముట్లు ప్రభుత్వమే ఇవ్వాలని వారు తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు. మేము యూపీ వర్కర్స్ కు వ్యతిరేకం కాదు అని, వాళ్ల రాష్ట్రంలో వాళ్ళ జీవనోపాధి చేసుకోవాలని తెలిపారు. కరోనా తర్వాత తమ రంగం పూర్తిగా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కొందరు వ్యక్తులు స్వార్థపూరిత చర్యలకు పాల్పడడం దారుణమని తెలిపారు. అంతేకాకుండా యూపీ నుంచి కార్మికులను అతి తక్కువ రేట్లకు పనులకు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ అసోసియేషన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నదే మా లక్ష్యము అని వారు తెలిపారు. తమ యొక్క సమస్యలను ఎమ్మెల్యే మంత్రి సత్య కుమార్ యాదవ్కు టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు.వందలాదిమంది కార్పెంటర్స్ కుటుంబాలకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ బైక్ ర్యాలీలో వందలాదిమంది కార్పెంటర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సూరి, నంజుండ ఆచారి, పెద్ద సంఖ్యలో కార్పెంటర్స్ పాల్గొన్నారు.