London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

పండుగలా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ

పింఛన్లు పంపిణీ చేసిన వీరభద్ర గౌడ్

విశాలాంధ్ర – ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండలంలో పింఛన్ల పంపిణీ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పింఛన్ల పంపిణీ చేపట్టారు. మండల కేంద్రంలో ఆలూరు టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని పింఛన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటి వద్దకే వెళ్లి పెరిగిన పింఛన్ డబ్బులను లబ్ధిదారులకు అందించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లు రూ.7 వేలు ఒకేసారి అందజేస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత, కల్లుగీత కార్మికులకు అందరికీ పెంచిన పింఛన్లు అందుతాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అనంతరం టిడిపి నాయకులు ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు గిరి మల్లేష్ గౌడ్, మాజీ ఎంపీపీ రత్నమ్మ భర్త మాజీ డైరెక్టర్ కృష్ణ యాదవ్, బిజెపి తాలూకా నాయకులు వెంకటరాముడు, జనసేన మండల కన్వీనర్ అరవింద్, మాజీ కన్వీనర్లు శ్రీనివాసులు గౌడ్, తిమ్మన్న, యాగంటి కృష్ణ, శేషాద్రినాయుడు, ఆర్.ఎం.పి రఘు, టీడీపీ ఎస్సీ సెల్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సంజన్న, యూత్ నాయకులు సతీష్ కుమార్, లక్ష్మన్న, ఉచ్చీరప్ప యాదవ్, సర్పంచ్ అంజినయ్య, ఎంపీటీసీ లు నరసప్ప, రహీంతుల్లా, హోటల్ అంపయ్య, హనుమంతురెడ్డి, రాజకుమార్, అంగడి వీరేష్, మల్లిస్వామి, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img