London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

వేడుకగా పింఛన్ల పంపిణీ

విశాలాంధ్ర – పరవాడ : రాష్ట్రంలో పింఛను దారులు పండగ చేసుకుంటున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పరవాడ, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో సోమవారం ఆయన పించను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి లబ్ది దారులకు నగదు అంద జేశారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా పెంచిన పింఛన్లను ఇవ్వడం జరుగు తోందన్నారు. అంతకు ముందు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు, 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పైల జగన్నాథరావు, జోనల్ కమిషనర్ సన్యాసినాయుడు, కూటమి నాయకులు వియ్యపు చిన్న, రెడ్డి శ్రీనివాసరావు, పైల రామచంద్రరావు, బొండా తాతారావు, బుగుడి రామగోవిందరావు, మోటూరి సన్యాసినాయుడు, బొద్దపు అయ్యబాబు తదితరులు పాల్గొన్నారు. తానంలో సర్పంచ్ కన్నూరు దేవి వెంకటరమణ అధ్యక్షతన పింఛను పంపిణీ కార్యక్రమాన్ని టిడిపి పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ గండి బాబ్జి ప్రారంభించారు. పెరిగిన నగదుతో కలిపి పింఛన్ ను సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పైల జగన్నాధరావు, గండి వంశీ, వర్రి మంగ లక్ష్మి వసంతరావు, పైల లలిత దేముడుబాబు, చీపురుపల్లి కృష్ణవేణి, గొరుపూటి సన్యాసినాయుడు, గొరుపూటి సన్యాసిరావు, రొంగలి లక్ష్మీదేవి అప్పారావు, రొంగలి రమ్య సన్యాసిరావు, పైల జానకిరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయా పంచాయతీ గ్రామాల్లో కూటమి నాయకులు పింఛన్ల పంపిణీ చేసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img