వైద్యులు డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వ ఆసుపత్రి దంత వైద్యులు డాక్టర్ వివేకులాయప్ప అవగాహన శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు భారత ప్రభుత్వ హయాంలో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఆరోగ్య కార్యకర్తలకు ఓరల్గా క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. కావున ప్రజలందరూ ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వారికి సహకరించి మీ ఆరోగ్య పరిస్థితిని గమనించి క్యాన్సర్ బారిన పడకుండా వారు అవగాహన పెంచుతారని తెలిపారు. ఇప్పటికే క్యాన్సర్ ఉన్నవారు శీఘ్రంగా చికిత్స చేయించుకొని మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు పాల్గొన్నారు.