గురుగ్రామ్: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) 2024 జూన్లో 64,803 యూనిట్లు విక్రయించింది. ఇందులో దేశీయంగా 50,103 యూనిట్లు అమ్మగా, 14,700 యూనిట్లను ఎగుమతి చేసింది. అలాగే హెచ్ఎంఐఎల్ తన 2024 తొలి త్రైమాసిక విక్రయాలను 3,85,772 యూనిట్లతో ముగించింది. దీంతో వైఓవై వృద్ధిని 5.68%గా నమోదు చేసింది. దీనిపై హెచ్ఎంఐఎల్ సేల్స్ సీఓఓ తరుణ్ గార్గ్ స్పందిస్తూ, ఇయర్ ఆన్ ఇయర్ ఓవరాల్ సేల్స్ వృద్ధిని 5.68%తో హెచ్1ను ముగించినట్లు తెలిపారు. స్వదేశీ అమ్మకాలు 66% పెరిగాయన్నారు. సరికొత్త హ్యుందాయ్ క్రెటా కీలక పాత్ర వహించడంతో దేశీయ హెచ్1 అమ్మకాలు 91,348 యూనిట్ల రికార్డుకు చేరుకోగలిగందన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే 11% వృద్ధి రేటు నమోదయిందన్నారు.