ముంబయి: టాటా మోటార్స్ లిమిటెడ్ తన వాహనాల అమ్మకాల జోరు పెంచింది. 2024`25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏకంగా 2,29,891 వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 2,26,245 వాహనాలను అమ్మింది. ఈ త్రైమాసిక అమ్మకాల్లో సీవీ అమ్మకాలు 91,209 యూనిట్లు ఉండగా, పీవీ అమ్మకాలు 1,38,682 యూనిట్లు ఉన్నాయి. వైఓవై గణాంకాలు చూస్తే సీవీ అమ్మకాలు 6% పెరగ్గా, పీవీ అమ్మకాలు 1% తగ్గాయి. ఇక 2024 జూన్ మాసంలో టాటా మోటార్స్ 14,640 యూనిట్లు విక్రయించింది. 2023 జూన్లో అంటే ఇదే మాసంలో 14,427 యూనిట్లు విక్రయించింది. ఇక డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అమ్మకాలు కలిపి చూస్తే 2024 జూన్లో 15,224 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదేకాలంలో 14,770 యూనిట్లు అమ్మింది. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలను మరింత పెంచనున్నట్లు టాటా మోటార్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఫ్ు తెలిపారు.