బలిజ సంఘం వారి విన్నపం
విశాలాంధ్ర- ధర్మవరం;; మండల పరిధిలోని గోట్లూరు గ్రామంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి గ్రామములో స్థలమును కేటాయించాలని కోరుతూ గ్రామ బలిజ సంఘం వారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మా గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర పాత అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకుందని కావున అది తొలగించి ఆ స్థలాన్ని శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్టకు అనుమతించాలని వారు కోరారు. స్పందించిన చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకుని వెళ్లి, వారితో చర్చించి, మీకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు.