విశాలాంధ్ర -అనంతపురం : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నందు రేడియాలజీ విభాగంలో ఎస్ఎల్ డయాగ్నస్టిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీటి స్కాన్ మిషన్ ను వున్నతికరణ చేసిన సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అడిషనల్ డి.ఎం.యి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు బుధవారం పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ .యం ఓ డాక్టర్ హేమలత , రేడియాలజీ హెచ్.ఓ.డి. డాక్టర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.