విశాలాంధ్ర – ధర్మవరం: పార్లమెంట్ సమావేశాలలో హిందువులను కించపరిచే విదంగా మాట్లాడిన రాహుల్ గాంధీ హిందువులకు క్షమాపణ చెప్పాలని బిజెపి నాయకులు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా పట్టణంలో బిజెపి నాయకులు ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియచేసారు.ఈ సందర్బంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు జింక చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేష్, అసెంబ్లీ కన్వీనర్ గోపాల్ రెడ్డి తదితర నాయకులు మాట్లాడుతూ..హిందువుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.హిందువుల పట్ల కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని అన్నారు. హిందువుల పట్ల కాంగ్రెస్ నిజస్వరూపం బయట పడింది అన్నారు.భాద్యతగా ఉండాల్సిన ప్రతిపక్ష నేత భాద్యత రహితంగా మాట్లాడటం సరి కాదు అని హితవు పలికారు.హిందువులను అవమానించడం కూటమి నాయకులకు కొత్త కాదు అన్నారు.రాహుల్ గాంధీ వెంటనే హిందువులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో చేనేత సెల్ రాష్ట్ర నాయకులు గుండా పుల్లయ్య,శంకర చంద్రశేఖర్, గిర్రాజు రవి, పుట్లూరు నరసింహులు,కార్తీక్, భక్తవస్థలం, రామ శేఖర్ ,గరుగు మల్లికార్జున, చింత మంజునాథ్, నాగభూషణం,కృష్ణ ప్రసాద్, ప్రదీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.