London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

రేగాటిపల్లి రైల్వే గేటుకు వంతెన నిర్మించండి.. ప్రజల ఆవేదన

విశాలాంధ్ర- ధర్మవరం:; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు, పట్టణ నడిబొట్టునగల రేగాటిపల్లి రైల్వే గేటు కు వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే గేటు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గేటు వేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పిల్లల స్కూలు కూడా సమయం కాలాతీతమైతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన ప్రజల సమస్యలు ఏ ప్రభుత్వము కూడా పట్టించుకోకపోవడం అన్యాయమని వాపోతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా రేగాటిపల్లి రోడ్డు వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని తెలుపుతున్నారు. అత్యవసరంగా రాత్రిపూట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ఇదొక్కటే మార్గమని, అటువంటి సమయాల్లో గేటు వేయడం వల్ల రోగులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. ధర్మారం నుండి రేగాటిపల్లి తదితర గ్రామాలకు వెళ్లాలి అన్న కూడా రైతులు, కూలీలు, వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు పడక తప్పడం లేదని తెలిపారు. సరి అయిన సమయానికి కళాశాలలకు పాఠశాలలకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు కూడా వాపోతున్నారని తెలిపారు. అంతేకాకుండా బెంగళూరు ధర్మవరం మధ్య చాలా రైళ్ల రాకపోకలు, దాదాపు 16 గూడ్స్ బండ్లు ఈ రైల్వే గేట్ నుంచి పోవడం వల్ల చాలా సమయాన్ని తాము నష్టపోతున్నామని తెలుపుతున్నారు. అండర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు గాని ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు కానీ ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యను అధికారులు మరోసారి ప్రభుత్వ దిష్టికు తీసుకొని వెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img