విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ కేహెచ్ డిగ్రీ కళాశాలలో బిఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, అదేవిధంగా కళాశాలలో కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని తెలిపారు. ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 11 నుంచి 15 వరకు నచ్చిన కోర్సులకు ప్రవేశాలకు ఐచికంగా ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని డిగ్రీలో చేరి విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలని తెలిపారు. అదేవిధంగా మా కళాశాలలో ఎన్సిసి సి, ఎన్ఎస్ఎస్, మహిళా సాధికారత, స్పోర్ట్స్ విభాగము, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సులు కూడా ఉంటాయని తెలిపారు. నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యా బోధన ఉంటుందని తెలిపారు.