విశాలాంధ్ర ధర్మవరం:ధర్మవరం పట్టణంలోని కే.హెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో శ్రీ అల్లూరి సీతారామ రాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది .కళాశాలలో చరిత్ర విభాగం మరియు ఎన్.ఎస్.ఎస్, విభాగము సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు లను ఉద్దెసించి ప్రిన్సిపాల్ మాట్లాడుతు మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు అంటేనే బ్రిటిష్ వాళ్లకు చమటలు పట్టెదని,1922 నుండి 1924 వరకు రoపా విప్లవాన్ని నడిపి హింసాయుత పద్దతులద్వార ఆంగ్లేయులను భారతదేశం నుండి తరిమి కొట్టడానికి ప్రయత్నించిన గొప్ప యోధుడు అని తెలిపారు. “మిరపకాయటపా” (ముందు హెచ్చరికగా) పంపి పోలీస్ స్టేషన్ లపై డాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అని తెలిపారు. ఇతనికి సాయుధపోరాటంలో గామ్ మల్లుదొర, గాం గంటందొర , అగ్గిరాజుగా పెరు గాoచిన వేగిరాజుసత్యనారాయణ రాజు, పడాల్ మొదలగు గిరిజన వీరులుకూడా సహకరించడం జరిగిందన్నారు. అలగే జీవితంలో ప్రతి ఒక్కరికి ధైర్యం ఉండాలనీ ఐతేనే మనం ముందుకువెళ్లగలం అని అల్లూరి సీతారామరాజు ప్రాముఖ్యతను తెలియచేసారు. ఈ కార్యక్రమం లో చరిత్ర విభాగాధికారి ఎం. భువనేశ్వరి, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.బి గోపాల్ నాయక్, డా.యస్ .చిట్టెమ్మ, ఏ.కిరణ్ కుమార్ , పుష్పవతి, సరస్వతి, ఆనంద్, ఏ. సౌజన్య, హైమవతి తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.