విశాలాంధ్ర – ధర్మవరం : మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలు పాటకుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం గ్రంథాలయ అధికారిని, పాఠకులు, సిబ్బంది, అల్లూరి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ తెల్ల దొరల కబంధ హస్తాల నుంచి చిక్కుకున్న దేశానికి స్వాతంత్రం తెప్పించుటలో ఆయనకు ఆయనే సాటి అని తెలిపారు. అల్లూరి తన ప్రాణమును తెగించి తెలుగుజాతి బిడ్డ, మన్యం వీరుడు అని వారు కొనియాడారు. నేడు అల్లూరి సీతారామరాజును స్మరించుకోవడం మనందరి బాధ్యత అని వారు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించడమే కాకుండా ఆయన దేశం కోసం ప్రాణ త్యాగం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్ ,రమణ నాయక్, అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.