విశాలాంధ్ర – ఆస్పరి : రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ తక్షణమే మభ్యంతర భృతి (ఐఆర్) 30శాతం ఇవ్వాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పాటి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు రంగన్న, ప్రధాన కార్యదర్శి బాబుల ఆద్వర్యంలో యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పాటి, జిల్లా కార్యదర్శులు దేవపాల్, నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్న 117 జీవోను వెంటనే రద్దుచేసి ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సంరక్షణ కోసం పాటుపడుతూ, ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) లో ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని యుటిఎఫ్ సభ్యులుగా చేరాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, మోదిన్ భాష, ఖలీల్, సుధాకర్, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.