*అమెరికాలో భద్రాద్రి రామాలయం ప్రతిష్టించేందుకు తోడ్పాటు అందించాలి
*ప్రముఖ శిల్పి దురుగడ్డ బాలసుబ్రమణ్యం వినతి
విశాలాంధ్ర – ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా ) : ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీవాణి బాలసుబ్రమణ్యం శిల్పకళా మందిరంలో భద్రాద్రి రామాలయం నిర్మాణం పూర్తయి అమెరికా దేశంలోని అట్లాంట నగరంలో ప్రతిష్టించేందుకు కేంద్ర మంత్రుల సహాయ సహకారాలను కోరినట్లు శ్రీవాణి బాలసుబ్రమణ్యం శిల్పకళా మందిరం నిర్వాహకులు ప్రముఖ శిల్పి దురుగడ్డ బాలసుబ్రమణ్యం ఆచారి తెలిపారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను బాలసుబ్రమణ్యం మరి కొంతమందితో కలిశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తమ శిల్పకళా మందిరంలో నిర్మాణం పూర్తయిన భద్రాద్రి రామయ్య ఆలయం త్వరలోనే అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని అట్లాంటా నగరంలో ప్రతిష్ట కానుండడంతో ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సంపూర్ణ సహాయ సహకారాలు అందజేయాలని కోరుతూ యువశిల్పి బాల సుబ్రహ్మణ్యం ఆచారి మరియు అమెరికా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల బృందం కేంద్ర మంత్రులను కోరారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకుని వెళ్లాలని కోరుతూ వారు వినతి పత్రం సమర్పించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు కూడా తప్పకుండా ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని…భద్రాద్రి రామయ్య ఆలయం విషయంలో కూడా తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని శిల్పి దురుగడ్డ బాలసుబ్రమణ్యం ఆచారికి వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఆలయ ట్రస్టు బోర్డు బృందం తదితరులు పాల్గొన్నారు