కౌన్సిలర్ శంకర్ నాయక్
విశాలాంధ్ర-దుండిగల్ : పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించడం అభినందనీయ మని కౌన్సిలర్ శంకర్ నాయక్ పేర్కొన్నారు.ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటి పరిధి దుండిగల్ తాండ రాంకీ ఫౌండేషన్ వారు,సిఎస్ఆర్ నిధులతో దుండిగల్ తాండ -2 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు అందించే సదుద్దేశంతో నూతన వాటర్ ప్యూరిఫైయర్ కం స్టోరేజ్ యూనిట్ ని ఏర్పాటు చేశారు.ఈ వాటర్ ప్యూరిఫైయర్ స్థానిక కౌన్సిలర్ శంకర్ నాయక్, రామ్కీ హెచ్ ఆర్ చక్రవర్తి చేతుల మీదుగా ప్రారంభించారు.పాఠశాల హెడ్మాస్టర్ నారాయణరావు,వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చినందుకు రాంకీ వారికి పెద్దలందరికీ పాఠశాల తరఫున విద్యార్థిని, విద్యార్థులు తరఫున తల్లిదండ్రులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ శాంత స్థానిక పెద్దలు భీంసింగ్ నాయక్,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణరావు, ఉపాధ్యాయులు ముకుందారెడ్డి, గోపాల్, రవి, మోహన్ నాయక్, శృతి సోదర పాఠశాలకు చెందిన వెంకటేశ్వరరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.