–ఎంపీడీఓ గీతావాణి
విశాలాంధ్ర-రాప్తాడు : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీఓ గీతావాణి తెలిపారు. మండలంలోని ప్రసన్నాయపల్లి గ్రామంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమన్నారు. మొక్కలను వృక్షాలుగా చేయడం వల్ల భవిష్యత్తులో మనిషికి ప్రాణాధారమైన ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు వర్షాలు విరివిగా కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శశికళ, ఏపీఓ సావిత్రి, పంచాయతీ కార్యదర్శి రామచంద్రారెడ్డి, ప్రసన్నాయపల్లి శీనా, టెక్నికల్ అసిస్టెంట్ పరంధామ తదితరులు పాల్గొన్నారు.