అక్రమ సంబంధంతో భర్తను హతమార్చిన భార్య
ఇద్దరు పరారిలో,నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
ప్రభన్యూస్-కుత్బుల్లాపూర్ : జగద్గిరిగుట్ట పరిధిలో దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో శుక్రవారం బాలనగర్ ఏసిపి, జగద్గిరిగుట్ట సిఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని మహిళా భర్తను ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు పన్నాగం పన్ని హత్య చేయించిందని అన్నారు.
వివరాల్లోకి వెళితే జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వర నగర్ కు చెందిన అనిల్ అనే వ్యక్తి స్థానికంగా అంబులెన్స్ నడుపుతూ వాటిని 6 అంబులెన్సు లను మెయింటెన్స్ చేసే వాడు, అంబులెన్స్ లకు డ్రైవర్ గా షిరిడి హిల్స్ కు చెందిన సురేష్ అతనితోపాటు నాని,నవీన్, చందులు కూడా అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే వారు. అనిల్ భార్య భాగ్యలక్ష్మి బ్యూటీ పార్లర్ నడుపుతూ కూకట్పల్లి జయనగర్ లో ఉండేవారు.దాని తదనంతరం మూడు నెలల క్రితం అనిల్ ఆయన కుటుంబం జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వర నగర్ లో నివాసం ఉంటూ టిఫిన్ సెంటర్ నడిపేవారు అంటే టిఫిన్ సెంటర్లో పనిచేసే కృష్ణవేణి తో అనిల్ కు అక్రమ సంబంధం ఉన్నట్లు అక్కడ పని చేస్తున్న వాళ్ళు గుర్తించారు. అక్కడే హోటల్లో పనిచేస్తున్న అనిల్ భార్య భాగ్యలక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకుందని తన భార్య ప్రవర్తన పై తనకు అనుమానం వస్తుందని సురేష్ తో అనిల్ అన్నాడు.హోటల్ సిబ్బంది మల్లేష్, తన స్నేహితులు సంజయ్, రాజు నానీలతో పక్కాగా ప్లాన్ వేసిన భాగ్యలక్ష్మి అతను నిందిస్తున్న సమయంలో పదునైన కత్తులతో దాడి చేయించి అతడిని హతమార్చిందని, రాజు, సంజయ్ పరారిలో ఉన్నారని, మిగితా వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వారు తెలిపారు.