ప్రభుత్వ పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ వీర భద్రయ్య
విశాలాంధ్ర ధర్మవరం:: జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం వేడుకలతో పాటు జూలై ఏడవ తేదీ నుండి 14వ తేదీ వరకు పశుగ్రాస వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ వీరభద్రయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కుక్కలకు ఉచితంగా టీకాలు ఇవ్వబడుతుందని, జంతువులు పశుపక్షాదుల ద్వారా సంక్రమిత వ్యాధులు మనుషులకు సంక్రమిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఎంతో ప్రీతి పాత్ర మైన కుక్కల నుండి రేబిస్, అందమైన చిలుకల నుండి షిత్తకోశిష్ వ్యాధి ,పాడి పశువుల నుండి క్షయ, అంత్రాక్ష భూసెల్లోసిస్, కోళ్ల నుండి బర్డ్ ఫ్లూ, లాభాలను పెంచే పందుల నుండి మెదడు వ్యాపి వ్యాధి స్వైన్ ఫ్లూ వ్యాధులు రావడం జరుగుతుందని తెలిపారు. కుక్కలతో తదితర పెంపుడు పశువులతో పిల్లలు సన్నిహితంగా మెలుగుతూ ఉంటారని కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని వారు తెలిపారు. ఇది ముఖ్యంగా దోమలు, కుక్కకాటు, గాయాలు, బాగా ఉడకని మాంసం ,చేపలు, సరిగా కాచని పాలు సేవించడం ద్వారా, కలుషితమైన నీరు, గాలి, ఆహారం మొదలగు వాటి ద్వారా జినోటిక్ వ్యాధులు వస్తాయని తెలిపారు. రేబిస్ (పిచ్చి కుక్క కాటు వ్యాధి) వైరస్ వలన సోకే సంక్రమితవ్యాధులలో రేబిస్ అతి భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధి అని తెలిపారు. కుక్కలను పెంచేవారు వాటిని సక్రమంగా శ్రద్ధగా పెంచితే పరవాలేదు అంటే సకాలంలో టీకా మందులు నత్తల నివారణ మందులను ఇప్పించడం వంటివి తప్పనిసరిగా చేయాలని తెలిపారు. అలా చేయకుంటే వారు వారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగు వారికి, అంతేకాకుండా వారు పెంచే కుక్కలకు కూడా ప్రాణహాని తలపెట్టిన వారు అవుతారని తెలిపారు. ఈ వ్యాధి కలిగిన కుక్కలు మనుషులను పశువులను ఇతర కుక్కలను కరవడం వలన ఈ వ్యాధికారిక క్రిములు శరీరంలోనికి ప్రవేశించి వ్యాధిని కలుగ చేస్తాయని తెలిపారు. ఈ వ్యాధి వస్తే నీళ్లను చూసి భయపడటం, శరీర కండరాలలో విపరీతమైన నొప్పి ,ప్రవర్తనలో మార్పు కలగడం, వ్యాధి ముదిరిన కొద్ది శ్వాస తీసుకోవడం కష్టం కావడం ,చివరకు శ్వాస ఆడక వ్యాధి లక్షణాలు కనిపించిన వారము రోజులలో చనిపోతారని తెలిపారు. కావున రేబిస్ వ్యాధి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.