– చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజును కలసిన వినికిడి లోపం వికలాంగులు …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.06.07.2024ది. వినికిడి లోపం గల వికలాంగుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజును శనివారం వారు కలసిబి వినతి పత్రం అందజేశారు. 2016 వికలాంగుల చట్టాన్ని అమలు చేయాలని, రెగ్యులర్ కమీషనర్ ను నియమించాలన్నారు. విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని, విశాఖ ఈ.ఎన్.టి. మెడికల్ బోర్డు అధారిటీ లో రెగ్యులర్ ఆడియాలజిస్ట్ ను నియమించాలని కోరారు. అలాగే రిజర్వేషన్ ప్రాతిపదికన కమ్యూనిటీ భవనం, ఇళ్ల స్థలాలు, సబ్సిడీ రుణాలు ఇప్పించాలని తదితర న్యాయపరమైన సమస్యలన్నింటిని అధికార ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్ళి పరిష్కరించాల్సిందిగా వారు కోరుతున్నారు.