– హర్షం వ్యక్తం చేసిన యోగా గురువులు …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ) : ప్రాచీన యోగాకు మంచి గుర్తింపు కల్పించిన భారత ప్రభుత్వం 2023 గుజరాత్ లో జరిగిన జాతీయ క్రీడల్లో మరియు 2024 గోవాలో జరిగిన జాతీయ క్రీడల్లో అవకాశం కల్పించి యోగాని 63వ క్రీడగా గుర్తించడం పట్ల అనకాపల్లి జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లేటి సతీష్, చోడవరం పతంజలి యోగ శిక్షణ సాధకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం యోగ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో మరియు 2026 లో జరగబోయే ఏషియన్ గేమ్స్ లో కూడా యోగాకి అవకాశం కల్పించినట్లు భవిష్యత్తులో ఒలింపిక్స్ లో కూడా యోగాని చూసే అవకాశం ఉంటుందని యోగాలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిటి ఉష తెలియజేశారన్నారు. యోగా ను విశ్వవ్యాప్తం చేసిన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోదీకు మరియు ఇండియన్ ఒలంపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషకు యోగ క్రీడాకారులు తరఫున అభినందనలు తెలియజేసారు.