ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర -ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గంలో గత వైయస్సార్ ప్రభుత్వ హాయంలో పరిష్కృతం కాని సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కరించే దిశలో కృషి చేస్తామని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని సమస్యలను పరిష్కరించడానికి తెలుగుదేశ పార్టీ నాయకులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరిగిందని తక్షణమే వారందరూ కూడా అపరిస్వృతంగా ఉన్నటువంటి పరులు అన్నింటిని ఆగస్టు నెలలోపు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. అదేవిధంగా అర్హులకు ఇస్తున్న సామాజిక పెన్షన్లను తక్షణమే గుర్తించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి, అర్హులకు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ వార్డులలో చొరవ చూపాలని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ న్యాయం చేసే విధంగా నాయకులు కార్యకర్తలు, సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. టిడిపి పార్టీలో ఎవరిపైనైనా ఫిర్యాదు వస్తే పార్టీ పరంగా విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వారు హెచ్చరించారు.