హైదరాబాద్: భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫారం ఫోన్పే హైదరాబాద్లో కాన్ఫ్లూయెన్స్, కనెక్ట్ 2024 అనే రెండు ఫ్లాగ్షిప్ ఈవెంట్లను కలిపి తన పేమెంట్ గేట్వే సదస్సును విజయవంతంగా నిర్వహించింది. ఎస్ఎంఈలు, అవగాహన భాగస్వాములను శక్తివంతం చేసే దిశగా నిర్వహించిన ఈ అవగాహన, నెట్వర్కింగ్ సదస్సుకు ఈరంగంలో అగ్రగాములుగా ఉన్న సంస్థలు, ఔత్సాహికులు, టెక్నాలజీ నిపుణులు హాజరయ్యారు. వెబ్ డవలపర్లు, ఐటి సొల్యూషన్ స్ట్రాటజిస్టులు, ఈఆర్పీ కన్సల్టంట్ల కోసం రూపొందించిన ఫోన్పే పీజీ కాన్ఫ్లూయెన్స్ ఫోన్పే పీజీ పార్టనర్ ప్రోగ్రాంలోని విశిష్ఠతలను అందించింది. ప్రొడక్ట్ ఆఫరింగ్స్, ఇందులోని రివార్డింగ్ అఫిలియేట్ ప్రోగ్రాంను నిర్మించుకుని, దీని ద్వారాఎలా సంపాదించుకోవచ్చనే దాని గురించి నేర్చుకున్నారు. ఫోన్పే పీజీ కనెక్ట్ 2024 ఇ-కామర్స్, డీ2సీ బ్రాండ్లపై దృష్టి సారించింది. ఇది వివిధ బిజినెస్ యజమానులు ఫోన్పే ప్రముఖులతో కలసి, అభిప్రాయాలు పంచుకుని, ఫోన్పే పేమెంట్ గేట్వే గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశాలను కల్పించింది.