విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 25 వ వార్డు పార్థసారథి నగర్-2 సచివాలయమును నూతన భవనములోనికి మార్పు చేసి, 25 వ వార్డు అధ్యక్షులు భీమనేని ప్రసాద్ నాయుడు చో రువుతో మార్పు చేసి, టిడిపి పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. తొలుత అర్చకులు ద్వారా సచివాలయ భవనంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజల కోరిక మేరకు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ భవన మార్పు చేయడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా తాము చర్యలు చేపడతామని తెలిపారు. సచివాలయాల్లో ప్రజల ద్వారా ఫిర్యాదులు అందితే సహించేది లేదని, కఠిన చర్యలతో పాటు జిల్లా కలెక్టర్ కి, సంబంధిత మంత్రికి, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.