హెచ్.పీ గ్యాస్ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్
విశాలాంధ్ర ధర్మవరం:: కేంద్ర ప్రభుత్వం ద్వారా అర్హులైన మహిళలకు ఉచిత ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని హెచ్.పీ గ్యాస్ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు గోవింద చౌదరి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత ఉజ్వల పథకం పొందాలి అంటే కుటుంబంలో ఎలాంటి వాహనాలు కలిగి ఉండరాదని వృత్తి పన్ను చెల్లించకుండా ఉండాలని పక్కా ఇల్లు కలిగిన వారై ఉండరాదని, సంవత్సర ఆదాయం 50 వేల రూపాయలు పైబడి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదని, ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళా వినియోగదారులకు తప్పనిసరిగా కుల సర్టిఫికెట్ ఉండాలని తెలిపారు. అర్హులైన వారు ఉన్న యెడల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు నాలుగు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, నివాసమున్న ఇంటి జిరాక్సులు, కుటుంబములోని రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్లు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు పట్టణంలోని కోర్టు రోడ్డులో గల లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలో గాని సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 974299339 కు గాని 9550692545కు సంప్రదించే అవకాశం ఉందని తెలిపారు.