విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని ధర్మారం ఆర్టీసీ డిపో కార్యాలయ ఆవరణ ముందు 73వ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డిపో కార్యదర్శి ముస్తఫా అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం డిపో సీనియర్ నాయకులు టిఐ-3 కే శ్రీరాములు,శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు కేబి. నాగార్జున రెడ్డి హాజరై కేక్ కట్ చేసి ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనియన్ గొప్పతనాన్ని చాటిచెప్పారు. ఆనాటి నుండి నేటి వరకు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడి ఎన్నో సమస్యలకు పరిష్కారం యూనియన్ ద్వారా చూపబడింది అని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం, అన్యాయమైన కార్మికుల కోసం నిరంతరం ఎంప్లాయిస్ యూనియన్ అన్నివేళలా పోరాడుతుందని తెలిపారు. తదుపరి అందరికీ మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ సహకార దర్శి బి. నర్సింహులు, రీజనల్ నాయకులు ఆదినారాయణ, దూలప్ప, గ్యారేజీ కార్యదర్శి మల్లికార్జున, టి ఐ-3 పెద్దక్క, ఏడీసీ నరసింహులు, సిస్టం సూపర్వైజర్ సుధాకర్ తో పాటు అధిక సంఖ్యలో ఉద్యోగ సోదరా సోదరీమణులు పాల్గొన్నారు.