విశాలాంధ్ర -ఆనందపురం : ఆనందపురం మండలం లోడగలవానిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన మామిడి ఉదయ్ శంకర్ మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్లిక్ రిలేషన్ సెల్ గా నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పబ్లిక్ రిలేషన్ విభాగానికి ఉదయ్ శంకర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం , న్యాయవ్యవస్థ సహకారంతో నేర & అవినీతి నియంత్రణకు పాటుపడతానన్నారు. నేరం, అవినీతి, జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు, స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, బాండెడ్ లేబర్, బాల కార్మికులు, మానవ హక్కులు, వికలాంగుల హక్కులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడతానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో స్థానం కల్పించినందుకు, జాతీయ చైర్మన్ షేక్ సిరాజుద్దీన్ కు అలాగే మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.