విశాలాంధ్ర ధర్మవరం:: విద్యా వ్యవస్థను పటిష్ట పరిచికోవలసిన అవసరము బాధ్యత ఉందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు గుంటూరు గీతా రెసిడెన్షియన్లో రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో శ్రీ సత్యసాయి జిల్లా తరఫున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ తెలిపిన విధంగా నేటి సమాజంలో విద్యావ్యవస్థను పటిష్టపరుచుటకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో తగిన సలహాలు, సూచనలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. జీవో నెంబర్ 117ను రద్దు పరచడం, ఎం ఈ ఓ-1, ఎంఈఓ-2 పేర్లను తీసివేసి అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పేరు మార్చాలని తెలిపారు. ఎంఈఓ-2 పంచాయతీరాజ్ తరఫున, ఎంఈఓ-1 ప్రభుత్వ పాఠశాల తరఫున సమానమైనటువంటి హక్కులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. వీటిని అమలుపరచగలిగితే విద్యావ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామకృష్ణ, సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మాజీ యుటిఎఫ్ అధ్యక్షులు, అనంతపూర్ జిల్లా నుంచి గురు ప్రసాద్ తోపాటు ప్రతినిధులు పాల్గొన్నారు.