విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎన్జీవో హోం లో శ్రీ సత్య సాయి జిల్లా బీసీ న్యాయవాదుల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ షాకే నరేష్ అట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా గౌరవ అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాదులు జిసి. నల్లప్ప, ఏ. కృష్ణమోహన్, అధ్యక్షుడిగా మేకల రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా కే. అశోక్ కుమార్ నియమించబడింది. త్వరలో పూర్తి దశలోనే కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీసీ న్యాయవాదుల సమస్యలపై పోరాటాలు సెల్ఫీ పరిష్కరించే దిశలో కృషి చేస్తామని కమిటీ వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు మహేష్, కిషోర్ కుమార్, బిల్లె రవి, సాకే రామాంజనేయులు, బాబు, బిళ్లె నరేంద్ర పాల్గొన్నారు.