విశాలాంధ్ర- ధర్మవరం: మండల పరిధిలోని గోట్ళూరు గ్రామంలోని అనాధాశ్రమంలో టిడిపి గుంటూరు యూత్ లీడర్ టిఎన్ఎస్ఎఫ్ పెనుకొండ కార్యదర్శి రాణా ప్రతాప్ రాయల్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వృద్ధులకు దుస్తులు, అరటిపండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం రాణా ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకొని మానవతా విలువలు పెంపొందించేలా అనాధశ్రమంలోని వారికి పలు రకాలుగా సేవలు అందించాలని తెలిపారు. మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడుతామని తెలిపారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.