డి యం హెఛ్ ఓ డా ఈ బి దేవి
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం పట్టణంలోని 9 వ సచివాలయం పరిధిలోగల నీరుగంటి వీధి లో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమమును అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి డాక్టర్
ఈ.బి దేవి తనిఖీ చేశారు. ఇంటింటా తిరిగి దోమలు వృద్ధి చెందకుండా నీరు నిలువ వుంచుకునే అన్ని రకాల కంటైనర్లు ను పరిశీలించారు. లార్వా ఉన్న కంటైనర్స్ లను శుభ్రం చేయించారా లేదా అని పరిశీలించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంను పక్కగ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఇంటి పరిసరాలు శుభ్రంగా వుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమమును సమర్థవంతంగా వంద శాతము ప్రతివారము చేయాలని ఇంటిలోపల ఇంటిపరిసరాలలోలార్వా
క నిపించకుండా చూడాలని ఏ ఎన్ ఎం మరియు ఆశను ఆదేశించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మలేరియా. డెంగ్యూ నివారణ కోసం మలేరియా సిబ్బంది పనిచేసేలా చూడాలని మలేరియా అధికారి ఓబులు ను ఆదేశించారు .
అలాగే పట్టణం పరిధిలో గల అన్ని సచివాలయంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ను పర్యవేక్షించాలని మునిసిపల్ ఆరోగ్య అధికారి డా. విష్ణుమూర్తికి,సబ్ యూనిట్ ఆఫీసర్ మరియు సూపర్ వైజర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ మద్దయ్య, సూపెర్వైసోర్స్ నూర్ బాషా, శ్రీధర్, ఆరోగ్య కార్యదర్శి లక్ష్మీదేవి,మలేరియా అసిస్టెంట్ శంకరయ్య , ఆశ లు పాల్గొన్నారు.