లాయర్ బాలసుందరి
విశాలాంధ్ర ధర్మవరం:: మోటార్ వాహన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని లాయర్ బాలసుందరి, హెడ్ కానిస్టేబుల్ పవన్ కుమార్, పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎల్పీ సర్కిల్లో గల శ్రీ సాయి కృప జూనియర్ కళాశాలలో మోటార్ వాహన చట్టాలపై కోర్టు, పోలీస్ శాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బాలసుందరి, పవన్ కుమార్, ప్రదీప్ లు మోటార్ వాహన చట్టాలపై గల వివరాలను, జరిమానాలను, మోటార్ వాహన చట్టాలను ఉపయోగించుకునే విధానాన్ని వారు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ టూ వీలర్ వాహనదారులు తప్పక హెల్మెట్ వాడాలని, ఫోర్ వీలర్స్ వారు తప్పక సీటు బెల్టు ధరించాలని, చట్టాలను అతిక్రమిస్తే శిక్షలు భారీగా ఉంటాయని తెలిపారు. సీటు బెల్టు, హెల్మెట్ వాడటం వలన ప్రాణాప్రాయం తప్పుతుందని తెలిపారు. అదేవిధంగా సెల్ ఫోన్ తో మాట్లాడి డ్రైవ్ చేయడం, మద్యం తాగి డ్రై చేయడం లాంటి పనులు చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇలా చేస్తే చనిపోయే ప్రమాదాలు కూడా అవకాశాలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వరాదని, అలా ఇస్తే అది చట్టరీత్యా నేరం కావడంతో పాటు, వారు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు జరగడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతారని తెలిపారు. కళాశాలలో ర్యాగింగ్ కు తావు ఇవ్వరాదని తెలిపారు. ఒకవేళ ర్యాగింగ్లు జరిగితే చట్టపరంగా పెద్ద శిక్షలై ఉంటాయని వారు తెలిపారు. నేటి వాహన చట్టంలో జరిమానాలు అత్యధిక మొత్తములో కలవని వారు వాటి వివరాలను తెలియజేశారు. జూలై నెల అంతా ఈ వాహన చట్టాలపై అందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు భగవంతు రెడ్డి, చంద్ర, విద్యార్థులతో పాటు ఆధ్యాపకులు కూడా పాల్గొన్నారు.