సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్
విశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని ఎన్జీవో హోం నందు సిఐటియు మండల కార్యదర్శి టీ.అయూబ్ ఖాన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఈఎస్ వెంకటేష్ (సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి) ఎం దిల్షాద్ (సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు) ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న సిపిఎం పార్టీ నాయకులు సమక్షంలో ధర్మవరం మండలం సిఐటియు నూతన కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.అనంతరం నూతన సిఐటియు కన్వీనింగ్ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. సిఐటియు నూతన కమిటీ కన్వీనర్ గా జెవి రమణ,
కో కన్వీనర్ గా అయుబ్ ఖాన్, ఎల్. ఆదినారాయణ, ఎం. బాబు ఏకగ్రీవంగా ఎంపిక చేసి, 19 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు ముకుంద, చెన్నకేశవ, వెంకట, అంగన్వాడి వర్కర్స్ నాయకులు సరస్వతి, దీనా, పోతక్క, స్కూల్ స్వీపర్స్ జయమ్మ. చౌడమ్మ, ముంతాజ్. హమాలి నాయకులు కోటి, కదిరప్ప, ఆశా వర్కర్స్ ఇర్ఫాన, వీఆర్ఏ నాయకులు రామకృష్ణ, సుధాకర్ ,తదితరులు పాల్గొన్నారు.