అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడేనా?
అధికారులు అక్రమరవాణాపై స్పందించేరా ?
విశాలాంధ్ర శింగనమల శింగనమల నియోజకవర్గం శింగనమల మండలంలో అక్రమ ఇసుక రవాణా యదేచ్చగా ఇలాగే కొనసాగుతోందా.?ఈ తతంగంమంతా అధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారా.?
అధికారులు వెంటనే స్పందించి నివారించేరా? ఉచిత ఇసుక రవాణా చేపట్టాలంటున్న సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక రవాణా చేపడతామని చెబుతున్నా నాయకులు వినకుండా బేఖాతరు చేస్తున్నారు, శింగనమల మండలం పెరవలికి సమీపంలోని
అడవిలో కంప చెట్ల మధ్యలో పగలంతా ఇసుకను డంపింగ్ చేసుకొని ట్రాక్టర్లు, టిప్పర్లతో, ప్రతిరోజు రాత్రి సమయాల్లో అక్రమంగా ఇసుక రవాణా కొనసాగించడం వెనక ఏదైనా బలమైన శక్తులు ఉన్నాయా? వ్యక్తులు ఉన్నారా? లేదా ఏదైనా బలమైన నాయకులు ఉన్నారా ? అనే విమర్శలు గుప్పుమంటున్నాయి
ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరికలు సైతం లెక్కచేయకుండా అక్రమ ఇసుక రవాణా చేయడం వెనక ఆంతర్యమేమిటో ! అక్రమ ఇసుక రవాణా వెనుకల నుండి నడిపిస్తున్న వారు ఎవరో?
బలమైన శక్తి అయి ఉంటుందా ?
ఇంత జరుగుతున్న అధికారులు ఈ అక్రమ ఇసుక రవాణా ను అరికట్టలేకున్నారం టే ఆ దేవుడికే తెలియాలి ?
ప్రభుత్వం అధికారంలోకివచ్చి నెలన్నరకే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఈ రకంగా అక్రమ ఇసుక రవాణా చేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది! నాయకులు అక్రమ ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి పొడుస్తూ ఇదేవిధంగా ఇలాంటి ఇసుకఅక్రమ రవాణా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు చేస్తున్నారని, ప్రజలు గుసగుసలాడుతున్నారు, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు,