విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని 29వ వార్డులోని మున్సిపల్ పాఠశాలను మంత్రి సత్య కుమార్ యాదవ్ సిబ్బంది, ఎంఈఓ గోపాల్ నాయక్ కలిసి పరిశీలించారు. అనంతరం హెడ్మాస్టర్ ఉమాపతి ద్వారా మధ్యాహ్న భోజన పథక వివరాలను మెనూ అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం యొక్క రుచి వివరాలను నేరుగా విద్యార్థినిల ద్వారా అడిగి తెలుసుకున్నారు. హెడ్మాస్టర్ మాట్లాడుతూ పాఠశాల సంఖ్యకు తగ్గట్టుగా పిల్లలు కూర్చొని తినడానికి డైనింగ్ హాల్, టాయిలెట్స్, పాఠశాల చుట్టూ పెద్ద కాంపౌండ్ కావాలని వారు విజ్ఞప్తి చేశారు. మంత్రి సిబ్బంది మాట్లాడుతూ మంత్రి దృష్టికి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.