విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : చంద్రబాబు చొరవతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15వేల కోట్ల రూపాయల నిధులు విడుదల అయినట్లు టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కోడిగుడ్ల ఏసేపు అన్నారు. గురువారం పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తగిన న్యాయం దక్కిందన్నారు. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంహభాగం నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతోనే సాధ్యమైందన్నారు.