విశాలాంధ్ర, కదిరి : కార్మికుల హక్కులు హరించే లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేస్తూ,బడా కంపెనీల నుండి వ్యవసాయాన్ని కాపాడాలని డిమాండ్ రైతు,కార్మిక సంఘాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ కార్యక్రమంలో భాగంగా తాహసిల్దార్ మురళీకృష్ణ కు వినతిపత్రం అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు దారాదత్తం చేస్తోందని విమర్శించారు. కార్పొరేట్లకు రాయితీలిస్తూ రైతులు వినియోగించే వ్యవసాయ పరికరాలు, ఎరువుల, క్రిమిసంహారిక మందులపై పన్నులు పెంచిందని తెలిపారు. రైతుల పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.ఎల్. నరసింహులు, నాయకులు జగన్మోహన్, రామ్మోహన్, ముస్తక్, రఫీ, ఆంజనేయులు రైతు సంఘం నాయకులు ఈశ్వర్ రెడ్డి,రామసినాయక్, నారాయణ, కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.