విశాలాంధ్ర-పామిడి (అనంతపురం జిల్లా) : మండలకేంద్రమైన పామిడి గ్రామపంచాయతీ కార్యదర్శిగా గోపాల్ శుక్రవారం ఉదయం10 గంటలకు పదవీబాద్యతలు స్వీకరించారు.
పామిడి గ్రామపంచాయతీ ఈఓగా విధులు నిర్వహిస్తున్న పి.చంద్రశేఖర్ గార్లదిన్నెకు వెళ్లారు.ఆ కార్యాలయ సిబ్బంది, దళితసంఘ నాయకులు, సచివాలయ ఉద్యోగులు ఆయనకు పుష్ప గుచ్చం అందచేసి శుభకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి జిల్లా కొత్తచెరువు నుంచి సాధారణ బదిలీపై పామిడికి వచ్చానని,ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈవో గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగస్తులు, సిబ్బంది, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.