శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవాసమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మందికి భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను వైద్యులు, నర్సుల చేతులు మీదుగా అందజేశారు. అనంతరం ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్లు కూడా పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి దాతగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ వారి భర్త వెంకటస్వామి సహాయ సహకారాలు అందించడం జరిగిందని, ఇందుకు కృతజ్ఞతలను తెలియజేశారు. పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవ సమితి వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహణ రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని, వరం లాగా అవి మా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఆసుపత్రి, రోగులు తరఫున సూపర్డెంట్ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలకు ఆసక్తిగా ఉన్న దాతలు ఎవరైనా సెల్ నెంబర్ 9966047044 గాని 903044065కు గాని సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.