జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం ; ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా అధికారులు జఠినం చేయడం సరియైన పద్ధతి, సమంజసం కాదని జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రీజినల్ కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలు ధరించి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం నాగార్జున రెడ్డి, డిపో కార్యదర్శి ముస్తఫా మాట్లాడుతూ
ధర్మవరం డిపో నందు సత్యసాయి జిల్లాలోని అన్ని డిపోల కంటే ఓవర్ టైం డ్యూటీల శాతము ఎక్కువగా ఉన్నదని, అందువలన పని భారము పెరిగిపోయినదని పలుమార్లు మెమొరాడం ద్వారా డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించమని చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లేదని తెలిపారు. సమస్య పరిష్కారం పై చొరవ చూపకుండా పై అధికారులు ఏ విధంగా ఆదేశిస్తే అదే విధంగా అమలుపరిచి సమస్యను పరిష్కరించకుండా జటిలం చేయడం పద్ధతి కాదని తెలిపారు. సమస్యను పరిష్కరించిన పక్షంలో నిరవధిక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిఎంకు తెలిపి, రీజినల్ కమిటీ పిలుపుమేరకు మా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నరసింహులు, బాబు, తిరుమలేశు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.