విశాలాంధ్ర, సీతానగరం: సీతానగరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మద్యం షాపుల దరఖాస్తుల సేకరణ ప్రక్రియను పరిశీలించడానికి విచ్చేసినట్లు అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్వీవిఎన్ బాబ్జీరావు తెలిపారు. మంగళవారం నాడు ఆయన సీతానగరం ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఇంతవరకు ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల వివరాలు పై ఆరా తీశారు. ఇంకా ఒక్కరోజు గడువు మిగిలి ఉండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈనెల 11న పార్వతీపురం మన్యం జిల్లాకేంద్రంలోనూ, విజయనగరంజిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా లాటరీ ద్వారా షాపులు ఎంపిక జరుగుతుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంగళవారం ఉదయంనాటికి52 మద్యంషాపులకు 365 దరఖాస్తులు రాగా, విజయనగరంజిల్లాలో 153 మద్యం షాపులకు 1800 పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఒక్కో మద్యం షాప్ కు ఎన్ని దరఖాస్తులు ఉచ్చ అన్నది వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చున్నారు. దరఖాస్తుదారులకు అన్ని అంశాలు తెలియజేసి వారిని చైతన్య పరచాలని తెలిపారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 11న లాటరీలో ముగ్గురుని ఎంపిక చేయడం జరుగుతుందని,మొదటవారు 24గంటల్లో వారి చెల్లించాల్సిన ధరావత్తు చెల్లించకపోతే రెండవ.వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండవ వారు చెల్లించకపోతే మూడో వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ, సీతానగరం, కురుపాం పరిధిలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో సిఐ పద్మావతి, ఎస్సై షరిఫ్ సిబ్బంది పి.అప్పలకొండ, కె. గౌరు, జి భూషణరావు, అనంతరావు, టి శేషగిరిలు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.