డా.జ్ఞాన్ పాఠక్
భారతదేశంలో బడివెలుపల 10శాతం మంది పిల్లలున్నారు. వీరంతా 6నుంచి 10ఏళ్లలోపు వారే. అంటే ఇప్పటికీ దేశంలో విద్యలేనివారు 10శాతం ఉన్నారంటే ఇది ప్రభుత్వాల వైఫల్యమే. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు అవసరమైన ఆహారభద్రత తగినంతగాలేదు. అనారోగ్యాలకు చికిత్స చేయించడానికి అవసరమైనంత డబ్బుఎక్కువ పిల్లలకు ఉండటంలేదు. ఆరోగ్యచికిత్స అందుబాటులో ఉండటంలేదు. ఆసుపత్రులలో చికిత్స చేయించుకునేందుకు సంవత్సరానికి 4,129 రూపాయలు కూడా ఖర్చుచేయలేని పరిస్థితి. వైద్యంకోసం నెలకు రూ.539 కూడా ఖర్చుచేయలేని పరిస్థితి ఉంది. 2022 జులై నుంచి 2023 జూన్ వరకు జరిగిన 79వ జాతీయ నమూనా సర్వే ప్రకారం, ఈ అంశాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. వీటితోపాటు గ్రామీణప్రాంతాల్లో కుటుంబాలకు అప్పులు పెరిగిపోతున్నాయి. ఇది ఎంతైనా అశ్చర్యం కలిగించేదని సర్వే తెలియజేసింది. యువతలో విద్య, ఉద్యోగం, శిక్షణ తదితర అంశాలలోనూ వెనుకబాటుతనం ఎంతైనాఉంది. పట్టణప్రాంతాల్లో 89.2శాతం పిల్లలు ప్రాథమిక విద్యారంగంలో, ప్రాధమిక విద్యారంగంలో 90.1శాతం మాత్రమే ఉన్నారు. గ్రామీణప్రాంతాల్లో వీరి సంఖ్య 90.5 శాతం ఉంది. పట్టణప్రాంతాల్లో బాలికలు 89.9శాతం చదువుకుంటుండగా గ్రామీణప్రాంతాల్లో 90.3శాతం మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 76.7శాతంమంది గ్రామీణప్రాంతాల్లో చదువుకుంటున్నారు. పట్టణప్రాంతాల్లో వీరి సంఖ్య 36.5శాతం మాత్రమేఉంది. ప్రభుత్వ సహాయంపొంది గ్రామీణప్రాంత ప్రైవేటు పాఠశాలల్లో 5.5శాతం, పట్టణప్రాంతాల్లో 18.2శాతం చదువుకుంటున్నారు. గ్రామీణప్రాంత ప్రైవేటు స్కూళ్లలో 16.6శాతం, పట్టణప్రాంతాల్లో 43.8శాతం చదువుకుంటున్నారు. వివిధకారణాల వలన 6 నుంచి 18ఏళ్ల వయసులోఉన్న పిల్లలు ఏనాడూ ప్రాధమిక స్కూళ్లల్లో పేర్లు నమోదు చేయించుకోలేదు. గ్రామీణప్రాంతాల్లో ఆర్ధిక సమస్యలతో 14.9శాతం, పట్టణప్రాంతాల్లో 23.6శాతం మంది చదువుకు దూరంగా ఉంచుతున్నారు. విద్యపై ఆసక్తిలేని పిల్లలు, పిల్లలను స్కూళ్లకు పంపించడానికి ఆసక్తిలేని తల్లిదండ్రులు 22.2శాతం మంది ఉన్నారు. ఎప్పుడూ అనారోగ్యాలతో ఉంటున్న పిల్లలు 12.6శాతం, వికలాంగులుగా ఉన్నవారు 15.1శాతం ఇంకా ఇతర కారణాలతో స్కూళ్లలో చేరని పిల్లలు 25.1శాతం ఉన్నారు. 15ఏళ్లకుపైగా ఉన్న పిల్లలు 81.6శాతం మంది కేవలం చదవడానికి సాధారణ అంశాలను రాయడానికి కావలసిన చదువుమాత్రమే చదువుకున్నారు. సాధారణ అవగాహన కూడా వీరికుంటుంది. చదవడం, రాయడం తెలిసిన వారిలో బాలికలు 74.8శాతం, బాలురు.88.3శాతం ఉన్నారు. బాలురు, బాలికలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగాఉంది. 1524ఏళ్ల మధ్యగల పిల్లలలో 97.9శాతం మంది బాలురు, 96శాతం మంది బాలికలు ఉన్నారు. స్కూళ్లల్లో ప్రాథమిక విద్యను ఎక్కువ సంవత్సరాలుపూర్తి చేయడానికి 15ఏళ్లు చదువుకుంటున్నారు. దేశంలో వీరి శాతం 8.4గా ఉంది. బాలికల్లో 7.4సంవత్సరాలు, బాలురులో9.3 సంవత్సరాలు ప్రాధమిక స్కూళ్లలో చదువుకునేవారున్నారు. అదే గ్రామీణ ప్రాంతాలలో అయితే బాలబాలికలు కలిసి 7.5సంవత్సరాలు చదువుతుండగా, బాలికలు 6.4ఏళ్లు, బాలురు 8.5ఏళ్లు చదువుతున్నారు. అదే పట్టణప్రాంతాల్లో బాలురు 10.5 సంవత్సరాలు, బాలికలు 9.7సంవత్సరాలు చదువుతున్నారు. దేశంలో మాధ్యమిక విద్యారంగంలో 25ఏళ్లకుపైగా ఉన్న విద్యార్థులు 38.6శాతం గ్రామీణప్రాంతాల్లో ఉండగా, పట్టణప్రాంతాల్లో 56.6శాతం మందిఉన్నారు. జాతీయస్థాయిలో పైన తెలిపిన వయసుగలవారు 46.2శాతం మాధ్యమిక విద్యలో ఉన్నారు. బాలికలు 31శాతం ఉన్నారు. పట్టణప్రాంతాల్లో పురుషులు 63 శాతం ఉండగా, యువతులు 50.1శాతం ఉన్నారు. గ్రామీణప్రాంతాల్లో చదువుకుంటున్న యువత అటు యువకులు, ఇటు యువతులు కలిసి 38.4శాతం మంది మాధ్యమిక విద్యలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 15
29ఏళ్ల మధ్యగల యువతలో విద్యారంగం, ఉద్యోగాలు, శిక్షణ లేనివారు 25.6శాతం మందిఉన్నారు. వీరిలో 44.6శాతం యువతులు, 8శాతం యువకులు ఉన్నారు.
గత సంవత్సరంలో సగటున ఇంటికి వైద్యంకోసం గ్రామీణప్రాంతాలలో 4496, పట్టణ ప్రాంతాల్లో 6877రూపాయలు ఖర్చు చేశారు. ఒక్కొక్కరు 1035 రూపాయలు గ్రామీణప్రాంతాల్లో, 1879 రూపాయలు పట్ణణప్రాంతాల్లో వైద్యానికి ఖర్చుచేశారు. ఆసుపత్రుల్లో చేరకుండా వైద్యంకోసం గ్రామంలో ఒక్కొక్క ఇంటికి 4129రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 606 రూపాయలు నెలకు ఖర్చు చేస్తున్నారు. గ్రామంలో ఒక్కొక్కరికి నెలకు రూ.124లు, పట్టణప్రాంతాల్లో నెలకు 166రూపాయాలు మాత్రమే ఖర్చు చేయగలుగుతున్నారు. 18ఏళ్లకుపైగా వయసుగల లక్షమంది ఎక్కువగా అప్పుల్లో ఉంటున్నారు. సర్వే ప్రకారం, లక్షకు 18,322మంది అప్పుల్లో ఉంటున్నారు. అటు గ్రామీణప్రాంతాలు, ఇటు పట్టణప్రాంతాల్లో సాధారణస్థాయిలో ఉన్న ప్రజలు సంపాదించుకుంటున్న మొత్తానికి ఖర్చు చేసే మొత్తాలకు చాలా తేడా ఉంటోంది. ఇదిఎంతైనా ఆందోళనకర పరిస్థితి.